Kandukur Incident : చంద్రబాబుపై జగన్ ఫైర్

by Sathputhe Rajesh |   (  Updated:2022-12-30 07:36:57  IST  )

కందుకూరు ఘటనపై ఏపీ సీఎం జగన్ ఘాటుగా స్పందించారు.

Kandukur Incident : చంద్రబాబుపై జగన్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: కందుకూరు ఘటనపై ఏపీ సీఎం జగన్ ఘాటుగా స్పందించారు. కందుకూరులో 8 మందిని చంపేశారని ఇంత కన్నా ఘోరం ఉంటుందా అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో షూటింగ్ కోసం 29 మందిని బలిగొన్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయం అంటే షూటింగ్‌లు, డైలాగ్‌లు కాదన్నారు. రాజకీయం అంటే డ్రామాలు కాదన్నారు. రాజకీయం అంటే పేద కుటుంబాల్లో మార్పు తీసుకురావడం అన్నారు. జనం రాకపోయినా వచ్చినట్లు చూయించేందుకు ఇరుకు సంధుల్లో టీడీపీ సభ పెట్టిందన్నారు. ఫోటో షూట్, డ్రోన్ షాట్‌ల కోసం చంద్రబాబు కందుకూరు సభ నిర్వహించారని మండి పడ్డారు.

Also Read...

Chandrababu Kavali Sabha: జగన్‌ను నమ్మి మళ్లీ మోసపోవద్దు

Next Story